ఒక్క ఊజీ ఈగ (Oogie fly) వల్ల వేలాది రైతులు రోడ్డునపడే పరిస్థితి..! టమాటా పంటపై మిగిలిందేమీ లేదు!తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటపై (Oogie fly) ఊజీ ఈగల ఉక్కిరిబిక్కిరి దాడులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ దశలో ఉన్నా టమాటా కాయలపై ఈ ఈగలు విరుచుకుపడుతూ, మార్కెట్ విలువను పూర్తిగా తగ్గిస్తున్నాయి.
కాయలపై రంధ్రాలు.. నాణ్యత కోల్పోయిన పంట
ఉఝీ ఈగలు ముఖ్యంగా పచ్చి, దోర, పూర్తిగా పండిన టమాటాలపై చేరి వాటిని చీల్చేస్తుంటాయి. రంధ్రాలు పడటంతో టమాటాలు నీరు కార్చి మెత్తబడిపోతూ నాసిరకంగా మారిపోతున్నాయి. వీటిని చూసే వినియోగదారులు ముఖం తిప్పేస్తున్నారు. దీంతో పంటకు కనీస ధర కూడా దక్కడం లేదు.
రైతుల కన్నీరు.. పంటను రోడ్లపై పడేస్తున్న వాస్తవం
ఇప్పటికే టమాటా ధరలు గిట్టుబాటు కాక రైతులు బోరున విలపిస్తుండగా, ఊజీ ఈగల దాడితో మరింత దెబ్బతిన్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడోమైలు మార్కెట్ వద్ద మాత్రం పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎటు చూసినా నాణ్యత కోల్పోయిన టమాటాలు రోడ్లపై పడి ఉండటమే కనిపిస్తోంది.
మార్కెట్లో డిమాండ్ లేక రైతులు నష్టాలే మూటగట్టుకుంటున్నారు
ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తమ పంటను అమ్మలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. నాణ్యతలేని కాయలకు ఎవరూ ధర పలకకపోవడంతో, ఆ పంటలు రోడ్డుపై పడేయడం తప్ప వేరే మార్గం లేక farmers విలపిస్తున్నారు.
Also read:

