మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్ఛి ఫిదా సినిమాతో హల్ చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తెలుగులో సాయి పల్లవికి (Sai Pallavi)సపరేట్ క్రేజ్ ఉంది. ఆమెను టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. టాలీవుడ్లో సాయిపల్లవి చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. సాయి పల్లవి పద్ధతిగా కనిపిస్తూ స్కిన్ షోకు నో చెప్తుంది. అయితే సాయి పల్లవిని సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే సాయి పల్లవి (Sai Pallavi)ఇంతవరకు ఎలాంటి యాడ్స్ లో నటించలేదు. అయితే ఓ యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ చేశారట. కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పిందట. ఓ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు సాయి పల్లవితో యాడ్ షూట్ చెయ్యాలని అనుకున్నారట. చర్మం రంగుకి ప్రాధాన్యత ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఆ యాడ్స్ కు నో చెప్పిందట సాయి పల్లవి.
Also read :
Bhatti Vikramaka :నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు
Chiranjeevi : తమ్ముడిని గెలిపించాలన్న అన్నయ్య

