లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ – కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావాలని ఆకాక్షించారు. – పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. అలాగే రాజధానిని నిర్మించాలని సూచించారు (Sharmila). – నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. – సంక్షేమం, అభివృద్ధి సమానంగా కొనసాగాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా, విభజన హామీలకు కట్టుబడితేనే- కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులోను- పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన కాంగ్రెస్నిలబడి – ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతామని ఆమె చెప్పారు.
Also read:
