Telangana: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జీవో

Telangana:

(Telangana) రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల అంశానికి త్వరలోనే శుభవార్త అందనుంది.పది రోజుల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేయనున్నట్టు (Telangana) సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో మంత్రి ఫోన్ ద్వారా పాల్గొని ఈ కీలక ప్రకటన చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులంతా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని మంత్రి తెలిపారు.అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తయ్యాయని అవసరమైన విధివిధానాలు సిద్ధమయ్యాయని చెప్పారు.

రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి స్పష్టంగా వెల్లడించారు.అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు కార్డులు అందేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టుల గుర్తింపుకు ముఖ్యమైన పత్రాలుగా ఉంటాయని తెలిపారు.సమాచార సేకరణలో ప్రభుత్వ కార్యక్రమాల కవరేజీలో ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఇక జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతైన చర్చలు జరిగాయని మంత్రి వెల్లడించారు.గత ప్రభుత్వ కాలంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు మరియు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఈ అంశంలో ఆలస్యం జరిగిందని చెప్పారు.అయితే ప్రస్తుతం ఆ న్యాయపరమైన అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం అధిగమించిందని తెలిపారు.

వచ్చే ఏడాది నాటికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని మంత్రి ప్రకటించారు.జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన స్థంభాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.అక్రిడిటేషన్ కార్డుల జారీ జర్నలిస్టుల భద్రతకు మరియు వృత్తిపరమైన గౌరవానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న ఈ అంశం పరిష్కార దిశగా సాగుతుండటంతో జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. రాబోయే రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also read: