Ponnam: స్థానిక ఎన్నికల ఆలస్యానికి కేంద్రమే కారణం

స్థానిక ఎన్నికల ఆలస్యానికి కేంద్రమే కారణం

తెలంగాణలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీరువల్లే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Ponnam) పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పలు అపోహలు ప్రజల్లో వ్యాపించకుండా ఉండేందుకు (Ponnam) కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponnam Prabhakar counters BRS, BJP charges, says Congress is 'pro-farmer' -  The Hindu

రాష్ట్రవ్యాప్తంగా కులగణనను చట్టబద్ధం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ముందుకెళ్లిందని మంత్రి తెలిపారు. ఈ చట్టం తెలంగాణ గవర్నర్ ఆమోదానంతరం కేంద్ర ప్రభుత్వానికి పంపించబడిందని తెలిపారు. దీంతో, కేంద్రం నుంచి ఆమోదం ఆలస్యం కావడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకున్నదని వివరించారు.

Kishan Reddy is protecting KCR, says minister Ponnam Prabhakar

కుల గణన, రిజర్వేషన్ల విషయంలో 100% స్థాయిలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ చర్యలు సాగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు. కొంతమంది కావాలని అపోహలు కలిగించేలా మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని మంత్రి సూచించారు.

Also read :

Harish Rao: ఆసుపత్రిలో చేరిన హరీష్ రావు…

CM Revanth Reddy: 34 వైద్య కళాశాలల్లో వసతులు