తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ (TSED) ఆదేశాలు జారీ చేసింది. నిన్న పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేశారు. (TSED) ఈ పుస్తకాల్లో ముందుమాట మార్చకుండానే వీటిని విద్యాశాఖ ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
దీంతో పుస్తకాలన్నీంటినీ సేకరిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో సీఎం చంద్రశేఖర్ రావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. . కాగా కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
Also read:

