కేంద్ర ఎన్నికల కమిషన్ (Vice President) ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ప్రకారంగా, ఉప రాష్ట్రపతి (Vice President) పదవికి ఎన్నికలు వచ్చే నెల సెప్టెంబర్ 9న జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఈ నెల ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 9న ముగుస్తుంది.
ఈ మేరకు ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే తేదీ నుంచి అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్లు స్వీకరించే తుది తేదీ ఆగస్టు 21గా నిర్ణయించారు. అనంతరం ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువును ఆగస్టు 25గా ఈసీ ప్రకటించింది.
ఎన్నిక ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) పూర్తి చేసి ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ప్రత్యేకంగా ఉండే విధంగా నిర్వాహించబడతాయి. ఈ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారు ప్రత్యేకంగా ఏర్పాటైన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులే. దీనిలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, లోక్సభ సభ్యులు మాత్రమే ఓటేయగలుగుతారు. ఈ ఓటింగ్ ప్రక్రియ రహస్యమైన బల్లెట్ విధానంలో జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ జాబితాను ఇప్పటికే ఈసీ ఖరారు చేసింది.
ఇప్పటి వరకు కొందరు రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధికార పక్షం, విపక్షం తమ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగ పరంగా కీలకమైనవి కావడంతో, అన్ని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటున్నాయి.
ఇలాంటిది దేశంలో రెండవ అత్యున్నత పదవి కావడంతో, ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వచ్చే రోజుల్లో మరిన్ని రాజకీయ ఉత్కంఠలు చోటు చేసుకునే అవకాశముంది.
Also read:

