వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్(WTC) ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023–2025 ఎడిషన్ కు మొత్తం 5.76 మిలియన్ డాలర్లుగా ప్రకటించింది. ఇది గత ఎడిషన్ల కన్నా డబుల్ కావడం విశేషం. లండన్లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(WTC) ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ నెగ్గిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్ల (రూ. 30.79 కోట్లు) ప్రైజ్మనీ దక్కనుంది. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ. 17.96 కోట్లు) ప్రైజ్మనీ అందుతుంది. 2023లో భారత జట్టుపై ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకే ప్రైజ్మనీ పెంచినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్ ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023–2025 ఎడిషన్ కు మొత్తం 5.76 మిలియన్ డాలర్లుగా ప్రకటించింది. ఇది గత ఎడిషన్ల కన్నా డబుల్ కావడం విశేషం. లండన్లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ నెగ్గిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్ల (రూ. 30.79 కోట్లు) ప్రైజ్మనీ దక్కనుంది. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ. 17.96 కోట్లు) ప్రైజ్మనీ అందుతుంది. 2023లో భారత జట్టుపై ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకే ప్రైజ్మనీ పెంచినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది
Also Read :