Train: రైలు దోపిడీ.. ఎక్కడంటే..?

జనగామ జిల్లాలో భారీ రైలు (Train) దోపిడీ జ‌రిగింది. నాగర్ సోల్​నుంచి నర్సాపూర్ కు ఎక్స్​ప్రెస్​ట్రైన్​(Train)  వెళ్తోంది. నిన్న అర్ధరాత్రి చిల్పూర్ మండ‌లంలోని నష్కల్- పెండియాల మధ్యలో రైలు చేరగానే ట్రాక్ ప‌క్కనే నిల్చున్న సుమారు 20 మంది దొంగ‌ల ముఠా రైలు ర‌న్నింగ్‌లో ఉండ‌గానే ప్రయాణికుల మీద దాడికి పాల్పడింది. ప్యాసింజర్ల మెడ‌ల్లోంచి బంగారు ఆభ‌ర‌ణాల‌ను బలవంతంగా లాక్కుని పారిపోయారు. భారీ మొత్తంలో బంగారాన్ని దోపిడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేశారు.

Also read: