Ponguleti: శాసన సభలో భూ భారతి బిల్లు

Ponguleti

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) ఇవాళ శాసన సభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త చట్టం ప్రతి ఎకరానూ రక్షిస్తుందని అన్నారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన ధరణి పోర్టల్‌లో లక్షల సమస్యలు వచ్చాయని అన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైందని అన్నారు. గత పాలకులు తెచ్చిన ఈ లోప భూఇష్ట చట్టం వల్ల భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటి కాళ్ల కింద నేల కదిలిపోయిందని విమర్శించారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నా.. పరిష్కారం చేసే మార్గం లేకుండా పోయిందని చెప్పారు(Ponguleti) . లోపభూయిష్టమైన ఆర్‌వోఆర్‌ చట్టం-2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు.

Image

లోపాల కారణంగా నాలుగు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అన్నారు. 18 లక్షల 26వేల ఎకరాలు పార్ట్‌-బీలో ఉందని, ఏ కారణం చేత ఈ భూమిని పార్ట్‌-బీలో పెట్టారనేది తెలియడం లేదన్నారు. పాసు బుక్కుల్లో ఉన్న భూములకు, పొజిషన్‌లో ఉన్న భూములకు తేడా కనుక్కోవడానికి చట్టంలో నిబంధనలు రూపొందించామని చెప్పారు. ఈ దేశంలో భూ సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటేనే ఒక బాధ్యత అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ధరణిని సాగనంపామని, ఆ స్థానంలో భూభారతి తీసుకొస్తున్నామని అన్నారు. గ్రామం కంఠాలు, ఆబాదీ భూములకు భూభారతి చట్టం పరిష్కారమార్గం చూపుతుందని అన్నారు. సభ్యులు సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటామని పొంగులేటి చెప్పారు. సాదా బైనామాల కింద 9.24లక్షల దరఖాస్తులొచ్చాయని, వాటికింద అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుకునే అవకాశం చట్టంలో కల్పించామని వివరించారు. ప్రతి ఏడాదీ జమా బందీ కార్యక్రమం నిర్వహించేలా చట్టంలో పొందుపరిచామని వివరించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేలా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు.

Image

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ శాసన సభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త చట్టం ప్రతి ఎకరానూ రక్షిస్తుందని అన్నారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన ధరణి పోర్టల్‌లో లక్షల సమస్యలు వచ్చాయని అన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైందని అన్నారు. గత పాలకులు తెచ్చిన ఈ లోప భూఇష్ట చట్టం వల్ల భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటి కాళ్ల కింద నేల కదిలిపోయిందని విమర్శించారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నా.. పరిష్కారం చేసే మార్గం లేకుండా పోయిందని చెప్పారు. లోపభూయిష్టమైన ఆర్‌వోఆర్‌ చట్టం-2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు.

Image

లోపాల కారణంగా నాలుగు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అన్నారు. 18 లక్షల 26వేల ఎకరాలు పార్ట్‌-బీలో ఉందని, ఏ కారణం చేత ఈ భూమిని పార్ట్‌-బీలో పెట్టారనేది తెలియడం లేదన్నారు. పాసు బుక్కుల్లో ఉన్న భూములకు, పొజిషన్‌లో ఉన్న భూములకు తేడా కనుక్కోవడానికి చట్టంలో నిబంధనలు రూపొందించామని చెప్పారు. ఈ దేశంలో భూ సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటేనే ఒక బాధ్యత అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ధరణిని సాగనంపామని, ఆ స్థానంలో భూభారతి తీసుకొస్తున్నామని అన్నారు. గ్రామం కంఠాలు, ఆబాదీ భూములకు భూభారతి చట్టం పరిష్కారమార్గం చూపుతుందని అన్నారు. సభ్యులు సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటామని పొంగులేటి చెప్పారు. సాదా బైనామాల కింద 9.24లక్షల దరఖాస్తులొచ్చాయని, వాటికింద అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుకునే అవకాశం చట్టంలో కల్పించామని వివరించారు. ప్రతి ఏడాదీ జమా బందీ కార్యక్రమం నిర్వహించేలా చట్టంలో పొందుపరిచామని వివరించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేలా భూభారతి చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు.

Also read: