KTR: గవర్నర్ విచారణకు ఆదేశించాలి

KTR

లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ కు గుండె నొప్పి వస్తే ఆయనను స్ట్రెచర్ పై తరలించాలి కానీ, బేడీలు వేసి జీపులో తీసుకు రావడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇవాళ ఉదయం రెండోసారి మళ్లీ గుండెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్‌ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు.

నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. గుండెపోటు వచ్చిన రైతుకు ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకురావడం శోచనీయమని అన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే నని స్పష్టం చేశారు. హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ ఈ అంశం లోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జైపూర్‌లో విందులు, వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ కు గుండె నొప్పి వస్తే ఆయనను స్ట్రెచర్ పై తరలించాలి కానీ, బేడీలు వేసి జీపులో తీసుకు రావడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇవాళ ఉదయం రెండోసారి మళ్లీ గుండెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.

గుండెపోటు వచ్చిన రైతుకు ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకురావడం శోచనీయమని అన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే నని స్పష్టం చేశారు. హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ ఈ అంశం లోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జైపూర్‌లో విందులు, వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Also read: