Harish Rao: ఉత్తమ్ ది ద్రోహ చరిత్ర

Harish Rao

కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు, మంత్రి ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారని, ఆ తర్వాతే శ్రీశైలం ఖాళీ చేసేలాగా ద్రోహం చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని.. అందుకే సీఎం రేవంత్​ స్పీచ్ ను బహిష్కరించామని తెలిపారు. అసెంబ్లీలో చిట్ చాట్ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. వారి నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దే. ఢిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడితే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నరు’ అని (Harish Rao) విమర్శించారు.

Image

త్యాగ చరిత్ర బీఆర్ఎస్ ది
‘పోతిరెడ్డిపాడు విషయంలో కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు. మేం 40 రోజులు అసెంబ్లీని స్తంభింపచేశాం. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకున్నం. ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. 573 టీఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చింది మేము.. ద్రోహ చరిత్ర ఉత్తమ్ ది. త్యాగ చరిత్ర బీఆర్ఎస్ ది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం.. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగాం. హుజూర్ నగర్ ని ముంపునకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నం’ అని హరీశ్ రావు అన్నారు,

Also read: