Job: జాబ్ క్యాలెండర్ రిలీజ్.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

Job

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌ విడుదల చేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనుమతితో ఈ (Job) జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. మొత్తం పోస్టుల భర్తీకి సంబంధించిన తేదీలను ప్రకటించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గతంలో రెండు సార్లు గ్రూప్‌-1 పరీక్ష రద్దు అయిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని చెప్పారు. అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ లో గ్రూప్ 3 నిర్వహిస్తామని తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులకు సెప్టెబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇదివరకే వాయిదా వేసిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్ లోనిర్వహిస్తామని ప్రకటించారు. ట్రాన్స్ కో ఇంజినీర్ల పోస్టులకు అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరి 2025లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గెజిటెడ్ కేటగిరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు (Job) అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరి 2025లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. గ్రూప్ వన్ కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని 2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ నిర్వహిస్తామని తెలిపారు. గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్ల నియామకం కోసం జనవరి 2025న నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల నియామకం కోసం డీఎస్సీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ లో నియామక పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మేలో పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. ఏప్రిల్ లో టెట్ నోటిఫికేషన్ వేసి జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నారు. జూలై లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని వివరించారు. పోలీసు శాఖలో ఎస్సై సివిల్ పోస్టులకు ఏప్రిల్ లో నోటిఫికేషన్ వేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర అకాడమిక్ పోస్టులకు జూన్ లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ లో భర్తీ చేస్తామని ప్రకటించారు. డిగ్రీ లెక్చరర్లు తత్సమాన పోస్టులకు జూన్ లో నోటిపికేషన్ వేసి సెప్టెంబర్ లో నియామక పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్–2 పోస్టులకు మే లో నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రూప్ 3 పోస్టులకు జూలైలో నోటిఫికేషన్ వేసి నవంబర్ లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు జులైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ లో పరీక్ష నిర్వహిస్తామని అన్నారు.

Also read: