ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం స్పెషల్ఫోకస్ పెట్టిందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. రాష్ట్రంలో కొత్త నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఎలాంటి దరఖాస్తులు లేవన్నారు. తాగు నీటి నల్లా కనెక్షన్లకు సంబంధించి మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, తక్కెనపల్లి రవీందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క (Seethakka) సమాధానమిచ్చారు. 2021 వరకు 53 లక్షల 98 వేల ఇండ్లకు వంద శాతం తాగునీరు అందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేసి నల్లా కనెక్షన్ల డిమాండ్ ను గుర్తించామని తెలిపారు. ‘ సర్వేలో 4 లక్షల 49 వేల ఇండ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించడం జరిగింది. 3 లక్షల 21 వేల ఇండ్లకు ప్రభుత్వం నల్లా కనెక్షన్ల ఏర్పాటు పూర్తి చేసింది. ఇంకా 1లక్షా 28 వేల ఇండ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సింది ఉంది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీంతో గొప్పగా నీళ్లు అందించిందని చెప్పుకున్నప్పటికి ఇంకా అనేక లక్షల ఇండ్లకు తాగునీరు అందిండం లేదు. మేం భగీరథ నీళ్లు అందించనప్పుడే ప్రజలు నీళ్లు తాగారు. అంతకుముందు నీళ్లే తాగలేదు అన్నట్లుగా ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతున్నారు. రవీందర్రావు ఏ నీళ్లు తాగి పెరిగారు? గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మారుమూల పల్లెలు, తండాలకు మిషన్భగీరథ నీళ్లు అందట్లేదు. వాటర్సప్లై కోసం మా ప్రభుత్వం ఉట్నూరు పరిధిలో 60కోట్లు, గజ్వేల్, భువనగిరి కోసం 210 కోట్లు, సిద్ధిపేటకు కూడా 3కోట్లు మంజూరు చేసింది. ’ అని సీతక్క అన్నారు.
ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం స్పెషల్ఫోకస్ పెట్టిందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో కొత్త నల్లా కనెక్షన్ల కోసం పెండింగ్ లో ఎలాంటి దరఖాస్తులు లేవన్నారు. తాగు నీటి నల్లా కనెక్షన్లకు సంబంధించి మండలిలో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, తక్కెనపల్లి రవీందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. 2021 వరకు 53 లక్షల 98 వేల ఇండ్లకు వంద శాతం తాగునీరు అందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేసి నల్లా కనెక్షన్ల డిమాండ్ ను గుర్తించామని తెలిపారు. ‘ సర్వేలో 4 లక్షల 49 వేల ఇండ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించడం జరిగింది. 3 లక్షల 21 వేల ఇండ్లకు ప్రభుత్వం నల్లా కనెక్షన్ల ఏర్పాటు పూర్తి చేసింది. ఇంకా 1లక్షా 28 వేల ఇండ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సింది ఉంది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీంతో గొప్పగా నీళ్లు అందించిందని చెప్పుకున్నప్పటికి ఇంకా అనేక లక్షల ఇండ్లకు తాగునీరు అందిండం లేదు. మేం భగీరథ నీళ్లు అందించనప్పుడే ప్రజలు నీళ్లు తాగారు. అంతకుముందు నీళ్లే తాగలేదు అన్నట్లుగా ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతున్నారు. రవీందర్రావు ఏ నీళ్లు తాగి పెరిగారు? గ్రామీణ మంచినీటి సరఫరా వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మారుమూల పల్లెలు, తండాలకు మిషన్భగీరథ నీళ్లు అందట్లేదు. వాటర్సప్లై కోసం మా ప్రభుత్వం ఉట్నూరు పరిధిలో 60కోట్లు, గజ్వేల్, భువనగిరి కోసం 210 కోట్లు, సిద్ధిపేటకు కూడా 3కోట్లు మంజూరు చేసింది. ’ అని సీతక్క అన్నారు.
Also read:

